Thursday, September 11, 2014

ts print media employees in crisis eenadu employees

Tuesday, August 5, 2014

'ఈనాడు' ఉద్యోగుల్లో, కుటుంబాల్లో విషాదం

1974 లో విశాఖపట్నం కేంద్రంగా ఆరంభమై... జర్నలిజం చరిత్రలో తనకంటూ ఒక అద్భుత అధ్యాయాన్ని నిర్మించుకున్న 'ఈనాడు' సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో, వారి కుటుంబాల్లో గత నలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేని విషాదం ఇప్పుడు గూడుకట్టుకుంది. అక్కడ జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు, కార్మికులు... ఆత్మస్థైర్యం కోల్పోయి నిస్పృహతో గడుపుతున్నారు. 

అందుకు కారణాలు... 
1) ప్రాసెసింగ్ సెక్షన్ లో పనిచేస్తున్న దాదాపు 150 మందిని ఉన్నపళంగా 'వదిలించుకునేందుకు' యాజమాన్యం కసరత్తు మొదలెట్టడం. చెప్పిన ప్రకారం రాజీనామా చేయని వాళ్లకు అదనంగా కొంత చెల్లించి వదిలించుకోవాలని చూడడం

2) ఫోటో గ్రాఫర్లపై కూడా యాజమాన్యం కన్నుపడడం 

3) సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సోమాజిగూడ నుంచి ఊరవతల ఉన్న ఫిల్మ్ సిటీ కి తరలించాలని నిర్ణయించడం

4) ఏడాదికి డెబ్బై కోట్లు ఆదా చేసుకునేవిధంగా వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టడం

ఇటు తెలంగాణా ఏర్పడిన తర్వాత, అటు పక్క చంద్రబాబు వచ్చాక... తమ బతుకుల్లో పెద్ద మార్పు వచ్చిందని అక్కడి ఉద్యోగులు పలువురు మా బృందం తో అన్నారు. "నేను ఇప్పుడు ఆఫీసుకు వెళ్ళాలంటే 116 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఉద్యోగాలు పోయి కొంతమంది ఏడుస్తుంటే... 20-30 ఏళ్ళు సేవ చేసాక... ఒళ్ళు, పర్సు హూనమయ్యేలా ప్రయాణం చేయాల్సిరావడం మా తలరాత," అని ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. 

ఇప్పటికే... Delhi, Mumbai మినీ ఎడిషన్లను పీకేసిన యాజమాన్యం...ఎప్పుడు ఏమి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందోనని ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు. "1974 ఆగస్టు లో మొదలైన 'ఈనాడు' 2014 ఆగస్టు కల్లా ఏమైపోతుందో..." అన్న భయం నాకుందని ఒక 30 ఏళ్ళు ఇందులో పనిచేసి... తన భవిత గురించి ఆందోళన చెందుతున్న ఒక ఉద్యోగి చెప్పారు.

No comments:

Post a Comment